ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళికి ఊరట లభించింది. ఆర్జీవీపై సీఐడీ (CID) నమోదు చేసిన కేసులపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. 2019లో విడుదలైన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై 2024లో కేసు నమోదు చేయడాన్ని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపై FIR నమోదు చేశారని RGV కోర్టుకు తెలిపారు. ఈ మేరకు ఆయన కేసును కొట్టేయాలని కోరారు.
పోసాని కృష్ణమురళికి ఊరట
నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి కూడా ఏపీ హైకోర్టులో ఊరట పొందారు. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలంటూ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాల్లో నమోదైన కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోకూడదని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.