గురువు ద్రవిడ్, శిష్యుడు గిల్ ఒకే వేదికపై అవార్డులు

గురువు ద్రవిడ్, శిష్యుడు గిల్ ఒకే వేదికపై అవార్డులు

టీమిండియా మాజీ కోచ్‌, లెజెండరీ బ్యాటర్ అయిన రాహుల్ ద్రవిడ్ కు అరుదైన గౌరవం దక్కబోతోంది. భారత క్రికెట్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ఆయన అందుకోనున్నాడు. ఈ అవార్డును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రతి సంవత్సరం భారత క్రికెట్‌కు విశేష సేవలు అందించిన దిగ్గజాలకు ప్రదానం చేస్తుంది. మార్చి 15న న్యూఢిల్లీలో జరగనున్న బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుకలో ద్రవిడ్ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని స్వీకరించనున్నాడు. భారత క్రికెట్‌లో “ది వాల్”గా పేరుగాంచిన ద్రవిడ్ తన అద్భుతమైన టెస్ట్ కెరీర్‌తో పాటు కోచ్‌గా కూడా దేశానికి గొప్ప విజయాలను అందించాడు.

ఇదే వేడుకలో టీమిండియా యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కు ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు దక్కనుంది. మరోవైపు దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆల్‌రౌండర్ ఆయుష్ మహాత్రేకు లాలా అమర్‌నాథ్ అవార్డు ఇవ్వనున్నారు. భారత మహిళల క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ కూడా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కారం పొందనుంది. ఆసక్తికరంగా, ఒకప్పుడు అండర్-19 ప్రపంచకప్లో గురువు ద్రవిడ్ మార్గదర్శకత్వంలో ఆడిన గిల్ ఇప్పుడు అదే వేదికపై అవార్డు అందుకోబోతుండడం క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment