ఫిబ్రవరి 5న వైసీపీ ఫీజు పోరు.. పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

ఫిబ్రవరి 5న వైసీపీ ఫీజు పోరు.. పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదల కోసం ఫిబ్రవరి 5న తలపెట్టిన ‘ఫీజు పోరు’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను వైసీపీ విడుద‌ల చేసింది. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం విద్యార్ధులకు సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని ఈ సందర్భంగా పలువురు నేతలు తెలిపారు. పిల్లలకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ పోరాడుతుందని వైసీపీ నేతలు ప్రకటించారు.

వినతిపత్రాలతో కలెక్టర్ల వద్దకు
ఫీజు సమస్యను పరిష్కరించేందుకు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించనున్నట్లు వైసీపీ నేతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం విద్యాదీవెన కింద రూ.2,800 కోట్లు, వసతిదీవెన కింద రూ.1100 కోట్ల స్కాలర్‌షిప్‌.. రెండూ కలిపి దాదాపు రూ.3900 కోట్లు బకాయి పడిందన్నారు. దీంతో కొన్ని చోట్ల కాలేజీల యాజమాన్యాలు విద్యార్ధులను క్లాస్‌లకు రానివ్వడం లేదు, మరికొన్ని చోట్ల సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం లేదని, పేద విద్యార్ధులు చదువులు మానుకుని కూలీనాలి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్ప‌డింద‌ని మండిప‌డ్డారు. విద్యార్థుల భ‌విష్య‌త్తుతో ఆడుకుంటున్న కూట‌మి ప్ర‌భుత్వంపై వైసీపీ పోరాటం కొన‌సాగుతుంద‌ని, సీఎం చంద్రబాబు విద్యార్ధుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని మండిప‌డ్డారు.

Join WhatsApp

Join Now

Leave a Comment