వంశీకి బెయిల్ వ‌స్తే.. రెడీగా మ‌రో రెండు కేసులు?

వంశీకి బెయిల్ వ‌స్తే.. రెడీగా మ‌రో రెండు కేసులు?

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వ‌ల్ల‌భ‌నేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. ఉద‌యం హైద‌రాబాద్‌లో అరెస్టు చేసిన పోలీసులు ఆగ‌మేఘాల మీద వారి వెహికిల్స్‌లో విజ‌య‌వాడ‌కు తీసుకువ‌చ్చారు. గ‌న్న‌వ‌రం టీడీపీ ఆఫీస్‌పై దాడిలో కేసులో ఏ-71గా ఉన్న వంశీనిహైద‌రాబాద్‌లో గురువారం ఉద‌యం ప‌ట‌మ‌ట పోలీసులు అరెస్టు చేయ‌గా.. ప్ర‌స్తుతం కృష్ణ‌లంక స్టేష‌న్‌లో విచార‌ణ కొన‌సాగుతోంది. కృష్ణ‌లంక పీఎస్ దగ్గరకు వల్లభనేని వంశీ కుటుంబ సభ్యులు, అభిమానులు, వైసీపీ నేత‌లు భారీగా చేరుకున్నారు. వంశీ అరెస్టు అక్ర‌మం అని మండిప‌డుతున్నారు.

ప్ర‌తీకార చ‌ర్యేనా..?
ప్ర‌స్తుతం అరెస్టు చేసిన కేసులో వంశీకి కోర్టులో బెయిల్ వ‌స్తే.. ఆయ‌న‌పై మ‌రో రెండు కేసులు పెట్టేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసిన‌ట్లుగా తెలుస్తోంది. 2019 ఎన్నికల సందర్భంగా నకిలీ పట్టాలు పంపిణీ చేసినట్టు ఫిర్యాదు చేయ‌గా, అందులో వ‌ల్ల‌భ‌నేని వంశీ పాత్ర లేదని అప్పట్లో పోలీసులు తేల్చేశారు. కాగా, కూట‌మి పార్టీలు అధికారంలోకి వ‌చ్చాక‌, వైసీపీలో యాక్టీవ్‌గా ఉండే నాయ‌కుల‌ను టార్గెట్ చేసింద‌ని వైసీపీ ఆరోపిస్తోంది. అక్ర‌మంగా కేసులు బ‌నాయించి వేధిస్తోంద‌ని మండిప‌డుతోంది. రెడ్ బుక్ రాజ్యాంగం ప్ర‌కారం రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం న‌డుస్తోంద‌ని ఆరోపిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment