వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి రాబర్ట్సన్పేట పోలీసులు నోటీసులు పంపించారు. పేర్ని నాని కుటుంబానికి చెందిన గోదాములో ఉంచిన రేషన్ బియ్యం మాయం అయ్యాయన్న అభియోగంతో ఆయన భార్య జయసుధపై కేసు నమోదైంది. ఈ కేసులో తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)కి పోలీసులు నోటీసులు పంపించారు.
ఈరోజు మధ్యాహ్నం 2 గంటలలోపే స్టేషన్కు రావాలని, అందుబాటులో ఉన్న డాక్యుమెంట్స్ తీసుకురావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పేర్ని నాని, పేర్ని కిట్టుకు సంబంధం లేకపోయినా పోలీసులు నోటీసులు పంపించడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, వైసీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయనే ఉన్నాయని, కేసులతో ఎలాంటి సంబంధం లేనప్పటికీ ఇలా నోటీసులు జారీ చేయడం రాజకీయ కక్ష సాధింపేనంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.