ప్రభుత్వాస్పత్రి (Government Hospital) నిర్లక్ష్యం (Negligence) కారణంగా నిండు గర్భిణి (Fully Pregnant Woman) మృతిచెందింది. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటన ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ప్రసవ నొప్పులతో పోలవరం పోలీస్ స్టేషన్ సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన శిరీషకు సరైన వైద్య సేవలు అందకపోవడంతో ఆమె పరిస్థితి విషమించింది.
ఆస్పత్రిలో నర్సులు తగిన స్పందన చూపకపోగా, రాత్రి సమయంలో డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతోనే ఈ దుర్ఘటనకు కారణమని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం ఒక వైద్యుడు హడావుడిగా వచ్చి చికిత్స చేయలేనని, శిరీషను రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని సూచించారని చెప్పారు. డాక్టర్ సూచన మేరకు ఆమెను రాజమండ్రి తరలిస్తుండగా శిరీష మృతి చెందింది. దీంతో శిరీష కుటుంబ సభ్యులు పోలవరం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, సిబ్బందిపై మండిపడుతున్నారు.
ఈ ఘటనపై ప్రతిపక్ష వైసీపీ స్పందించింది. ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్లు లేకపోవడంతో నిండు గర్భిణీ ప్రాణాలు కోల్పోయిందని, అటకెక్కిన సర్కారు వైద్యానికి ఇంతకంటే నిదర్శనం కావాలా చంద్రబాబు.. ? అని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ వైసీపీ ట్వీట్ చేసింది. “ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు, సిబ్బంది లేకపోవడం వల్ల నిరుపేదలు ప్రాణాలు కోల్పోతున్నారు” అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ‘#CBNFailedCM’ వంటి హ్యాష్ట్యాగ్లు ట్రెండ్ చేస్తున్నారు.
గర్భిణీ ప్రాణాలను తీసిన వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలను మెరుగుపరచడానికి, సిబ్బంది బాధ్యతను పెంచడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటన రాష్ట్రంలోని వైద్య వ్యవస్థ లోపాలకు అద్దం పడుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పోలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంతో నిండు గర్భిణీ మృతి
— YSR Congress Party (@YSRCParty) May 14, 2025
నొప్పులు రావడంతో రాత్రి ప్రభుత్వాసుపత్రిలో చేరిన గర్భిణీ శిరీష. కానీ.. డాక్టర్లు లేకపోవడంతో కనీసం పట్టించుకోని నర్సులు. ఉదయం నొప్పులు తీవ్రతరం కావడంతో సమాచారం అందుకుని హడావుడిగా వచ్చిన డాక్టర్
కానీ.. తాను ఏం… pic.twitter.com/niyrkQcaUq