ప్రధాన మంత్రి కొత్త కార్యాలయం ‘సేవా తీర్థ్’ ప్రారంభం

ప్రధాన మంత్రి కొత్త కార్యాలయం ‘సేవా తీర్థ్’ ప్రారంభం

బ్రిటిష్ పాలన నుంచి ప్రధాన మంత్రి కార్యాలయంగా ఉన్న సౌత్ బ్లాక్ కొత్త చిరునామా ‘‘సేవా తీర్థ్’’కు మారింది. ప్రధానమంత్రి కార్యాలయం (PMO)తో కూడిన ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ సేవా తీర్థ్‌ను ప్రధానమంత్రి Narendra Modi ఈరోజు ప్రారంభించారు. స్వాతంత్య్రం తర్వాత తొలిసారిగా కీలక కార్యనిర్వాహక విధులను ఏకీకృతం చేయడానికి, పరిపాలన సామర్థ్యాన్ని పెంచడానికి ఈ అధునాతన భవన సముదాయం నిర్మించారు. సేవా తీర్థ్ ప్రారంభం దేశ పరిపాలనలో కొత్త దశ ప్రారంభమని అధికారులు పేర్కొన్నారు.

సేవా తీర్థ్‌లో మూడు కీలక కార్యాలయాలు ఒకే చోట ఒక సమీకృత కేంద్రంగా ఉన్నాయి. ప్రధాన మంత్రి కార్యాలయం, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్, క్యాబినెట్ సెక్రటేరియట్ కలిపి ఏర్పాటు చేయబడ్డాయి. కర్తవ్య భవన్ 1, 2లో ఆర్థిక, రక్షణ, ఆరోగ్యం, విద్య, కార్పొరేట్ వ్యవహారాలు, వ్యవసాయం, న్యాయ మంత్రిత్వ శాఖలు ఉంటాయి. అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉండటం వల్ల నిర్ణయాలలో వేగం పెరుగుతుంది, శాఖల మధ్య సమన్వయం మెరుగవుతుంది, ప్రజలకు సేవలు అందించడం సులభతరం అవుతుంది.

కొత్త సముదాయం ఆధునిక సాంకేతికత, డిజిటల్ ఇంటిగ్రేషన్, పబ్లిక్ ఇంటర్‌ఫేస్ జోన్లు, సెంట్రలైజ్డ్ రిసెప్షన్, ఆధునిక గవర్నెన్స్ సపోర్ట్‌లతో రూపొందించబడింది. భద్రత కోసం స్మార్ట్ యాక్సెస్ నియంత్రణ, ఇంటిగ్రేటెడ్ నిఘా, అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఖాళీ అయిన సౌత్, నార్త్ బ్లాక్‌లలో ‘‘యుగే యుగీన్ భారత్ సంగ్రహాలయ’’ అనే పబ్లిక్ మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు, ఇది భారత ప్రభుత్వ చరిత్రను ప్రజలకు అందించే ప్రధాన కేంద్రంగా నిలుస్తుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment