ఫార్మాసిటీలో విష వాయువు లీక్.. ఇద్ద‌రికి తీవ్ర అస్వ‌స్థ‌త‌

ఫార్మాసిటీలో విష వాయువు లీక్.. ఇద్ద‌రికి తీవ్ర అస్వ‌స్థ‌త‌

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో విష వాయువు లీక్ కావడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. రక్షిత డ్రగ్స్ పరిశ్రమలో ఈ ఘటన సంభవించింది. వ్యాపించిన విష వాయువు కారణంగా ఇద్దరు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కంపెనీ సిబ్బంది వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

ఫార్మాసిటీలో ప్రమాదాలు ప్ర‌జ‌ల‌ను, కార్మికుల‌ను ఆందోళన కలిగిస్తున్నాయి. నవంబర్ 26న జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలోని ఠాగూర్‌ ఫార్మా లేబొరేటరీలో విషవాయవులు లీక్ అయ్యాయి. ఈ ప్ర‌మాదంలో ఒడిశాకు చెందిన కార్మికుడు మృతిచెందగా.. 9 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అదేవిధంగా డిసెంబర్ 6న ఫార్మాసిటీలోని శ్రీ ఆర్గానిక్స్ ఫార్మా కంపెనీలో మరో ప్రమాదం జ‌రిగింది. ప్రొడక్ట్ మ్యాన్ హోల్ ఓపెన్ చేసిన ఇద్ద‌రు కార్మికులపై ప్రమాదవశాత్తూ కెమికల్స్ పడి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ తరహా ప్రమాదాలు తరచూ జరుగుతుండ‌టంతో ఫార్మాసిటీలో భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment