సోష‌ల్ మీడియాలో చెప్పిన‌వ‌న్నీ నిరాధార‌మే.. పాస్ట‌ర్ ప్ర‌వీణ్ కేసు క్లోజ్‌

పాస్టర్ ప్రవీణ్ మృతి సెల్ఫ్ యాక్సిడెంట్‌.. డీఐజీ క్లారిటీ

పాస్టర్ ప్రవీణ్ పగడాల (Pastor Praveen Pagadala) మరణంపై నెలకొన్న అనుమానాలకు పోలీసులు (Police) ముగింపు ప‌లికారు. ఇది హత్య కాదని, సెల్ఫ్ యాక్సిడెంట్‌ అని ఏలూరు (Eluru) రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ (DIG Ashok Kumar) తేల్చిచెప్పారు. శనివారం రాజమండ్రి (Rajahmundry) లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. హైదరాబాద్ (Hyderabad) నుంచి బయలుదేరిన ప్రవీణ్, మార్గమధ్యంలో మద్యం (Alcohol) సేవించి, మూడు చోట్ల చిన్నపాటి ప్రమాదాల్లోకు గురయ్యారని డీఐజీ తెలిపారు. చివరికి రాత్రి సమయంలో హెడ్‌లైట్ (Headlight) డ్యామేజ్‌తో ప్రయాణిస్తున్న ప్రవీణ్ బైక్‌ (Bike) కంకర రోడ్డుపై స్లిప్‌ అయి, గుంతలో పడిపోవడంతో బైక్ అతని మీద పడిందని, తలకు తీవ్ర గాయమై మరణించారని వైద్య నివేదిక ఆధారంగా చెప్పారు.

అనుమానాలపై స్పష్టత..
ఈ ఘటనపై “హత్య (Murder)” అని వస్తున్న ప్రచారాలను పోలీసులు ఖండించారు. FSL నివేదిక, పోస్టుమార్టం వివరాలు, సీసీ టీవీ ఫుటేజ్ (CCTV Footage), యూపీఐ లావాదేవీలు (UPI Transactions) అన్నీ పరిశీలించినట్టు తెలిపారు. ప్రయాణ సమయంలో పాస్టర్ ఏరియాల్లో ఎవరి‌తో మాట్లాడారో తెలుసుకుని ఆ వ్యక్తులను విచారించారని వెల్లడించారు.

సోషల్ మీడియా (Social Media) లో అవాస్తవ ప్రచారాలు (False Propaganda) చేసిన వారిపై విచారణ ప్రారంభించామని, పాస్టర్ కుటుంబ సభ్యులనూ విచారించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేసినట్లు డీఐజీ వివరించారు. మరే వాహనాన్ని ఢీకొట్టిన‌ ఆనవాళ్లు లేవని, పక్కనే ఉన్న గుంతే ఈ విషాదానికి కారణమని స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment