పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ నుంచి పార్ల‌మెంట్‌ (Parliament)కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగంతో బ‌డ్జెట్ స‌మావేశాలు (Budget Session) ప్రారంభ‌మ‌య్యాయి. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగం అనంత‌రం కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను సభలో ప్రవేశపెట్టనున్నారు.

శనివారం కేంద్ర బడ్జెట్‌ను ఆమె పార్లమెంట్‌లో సమర్పిస్తారు. మొత్తం రెండు విడతలుగా సమావేశాలు నిర్వహించబడతాయి. మొద‌టి విడ‌త జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు, రెండో విడత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వ‌హించ‌నున్నారు. రేపు ఉదయం 11గంటలకు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) బడ్జెట్‌ ప్రవేశపెడతారు. అలాగే 16 బిల్లులను ఈ సమావేశంలో ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది కేంద్రం ప్ర‌భుత్వం. ఈ సమావేశాల్లో ప్రభుత్వ కీలక విధానాలు, ఆర్థిక ప్రణాళికలు చర్చకు వస్తాయి. బడ్జెట్‌పై ప్రజల అంచనాలు, ప్రతిపక్షాల స్పందన వంటి అంశాలు ఆసక్తికరంగా మారనున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment