వైమానిక దాడులకు దిగిన పాక్ (Pakistan) కు భారత్ (India) దీటైన జవాబిచ్చింది. భారత్ పరిరక్షణ చర్యలతో పాటు ప్రతీకార దాడులు చేపట్టింది. జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ ప్రాంతాల్లో పాకిస్తాన్ చేపట్టిన డ్రోన్లు (Drones), మిసైళ్ల (Missiles) దాడులను భారత వైమానిక రక్షణ వ్యవస్థ విజయవంతంగా తిప్పికొట్టింది. పంజాబ్ (Punjab) లోని పఠాన్కోట్ (Pathankot) ప్రాంతంలో భారత వైమానిక దళాలు పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఒక యుద్ధ విమానాన్ని (Fighter Jet) కూల్చివేసినట్లు సమాచారం. ఆ విమానానికి చెందిన పైలట్ను భారత దళాలు అదుపులోకి తీసుకున్నట్లు కూడా వార్తలు వెలువడుతున్నాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈ పరిణామాల మధ్య, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ (Pakistan Army Chief) జనరల్ ఆసిమ్ మునీర్ (General Asim Munir)ను పాకిస్తాన్ ప్రభుత్వ అధికారులు అదుపులోకి తీసుకున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఆయన నిర్ణయాలే.. భారత్తో యుద్ధానికి దారితీశాయని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం దేశాన్ని ప్రమాదంలోకి నెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. మునీర్ స్థానంలో జనరల్ సాహిర్ షంషాద్ మిర్జా (General Sahir Shamshad Mirza) బాధ్యతలు చేపట్టినట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. దీనికి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మే 7న భారత్ ప్రారంభించిన “ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)”లో భాగంగా భారత సాయుధ దళాలు పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoK) ప్రాంతాల్లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై క్షిపణి దాడులు నిర్వహించాయి. ఈ శిబిరాలు లష్కరే తోయిబా మరియు జైష్-ఇ-మొహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలతో అనుబంధంగా ఉన్నాయని భారత అధికారుల దృష్టికేటాయింది. ఈ చర్యలు ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా చేపట్టినవని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ దాడిలో 28 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.