శత్రుదేశం పాకిస్తాన్ను ప్రకృతి వైపరీత్యాలు సైతం వెంటాడుతున్నాయి. పాక్లో భూకంపం బీభత్సం సృష్టించింది. ఇప్పటికే భారత్ (India) చేతిలో మిలిటరీ, రాజకీయ పరాజయాలను ఎదుర్కొంటున్న పాకిస్తాన్ (Pakistan), అంతర్గతంగా బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (Balochistan Liberation Army – BLA) రెబల్స్ దాడులతో తీవ్రంగా నష్టపోతోంది. అలాంటి పరిస్థితుల్లో తాజాగా ప్రకృతి కూడా వెంటాడుతోంది.
తాజాగా పాకిస్తాన్లో భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్పై 4.0 తీవ్రతతో నమోదైన ఈ భూప్రకంపనలు అక్కడి ప్రజలకు భయాందోళనలు కలిగించాయి. భూకంపం సంభవించిన వెంటనే ప్రజలు ఇంటినుంచి బయటకు పరుగులు పెట్టారు. పాక్లోని అనేక ప్రాంతాల్లో ప్రకంపనలు స్పష్టంగా నమోదయ్యాయని స్థానిక మీడియా నివేదిస్తోంది.
ఇప్పటికే యుద్ధ భయాలు, ఆర్థిక సంక్షోభంతో వణికిపోతున్న పాకిస్తాన్కు ఈ ప్రకృతి విపత్తు మరింత దెబ్బ తీసిందనే చెప్పాలి. ఈ భూకంపానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉంది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందో స్పష్టత రావాల్సి ఉంది. పాక్పై భారత్ దాడులు, అంతర్గత రెబల్స్ అల్లర్లు, ఇప్పుడు ప్రకృతి విపత్తు… ఇలా ఒక్కదానికొకటి ఎదురవుతోంది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంతో పాకిస్తాన్ అల్లకల్లోలంగా మారిన నేపథ్యంలో, ఈ భూకంపం పాక్ ప్రజలకు మరింత కష్టాలు తెచ్చిపెట్టే అవకాశముంది.