భారత్–పాక్ (India–Pakistan) మధ్య ఉద్రిక్తతలు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025పై ప్రభావం చూపించాయి. పంజాబ్ కింగ్స్ (Punjab Kings) vs ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) మధ్య జరుగుతున్న మ్యాచ్ (Match) అర్థాంతరంగా నిలిచిపోయింది. జమ్మూ ఎయిర్పోర్ట్ (Jammu Airport)పై పాక్ ఆక్రమిత దాడి నేపథ్యంలో భారత సైన్యం అప్రమత్తమై, ధర్మశాల (Dharamsala)లో బ్లాక్ అవుట్ (Blackout) ప్రకటించింది. భద్రతా కారణాల చేత విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఫ్లడ్ లైట్స్ పనిచేయలేదు. దీని వలన మ్యాచ్ను సగంలోనే నిలిపివేయాల్సి వచ్చింది.
దేశ భద్రత చర్య నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ (Indian Army) ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో క్రీడా అభిమానుల మధ్య ఒక్కసారిగా గందరగోళం చోటు చేసుకుంది. ఈ పరిణామం #OperationSindoor కింద జరుగుతున్న చర్యలతో సంబంధం ఉందంటూ పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికారులు, సిబ్బంది ధర్మశాల క్రికెట్ స్టేడియాన్ని వెంటనే ఖాళీ చేయించారు.