వాహనాల తనిఖీలో పోలీసులకు ఊహించని సంఘటన ఎదురైంది. కారు (Car) లో డెడ్ బాడీ (Dead Body) లభ్యమైన ఘటన నిజామాబాద్ (Nizamabad) లో కలకలం రేపింది. పోలీసులు (Police) సాధారణ వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ కారు డ్రైవర్ ఆగకుండా ముందుకు వెళ్లిపోవడంతో అనుమానం వచ్చి వెంబడించి ఆ కారును పట్టుకున్నారు.
దాస్నగర్ (Dasnagar) శివారులోని నిజాంసాగర్ కెనాల్ (Nizamsagar Canal) వద్ద కారును అడ్డగించిన పోలీసులు డిక్కీని పరిశీలించగా అందులో ఒక మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలు కమల (Kamala) అని పోలీసుల విచారణలో తేలింది. ప్రాథమిక దర్యాప్తులో ఈ హత్య కేసులో రాజేశ్ (Rajesh) అనే వ్యక్తి నిందితుడిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును కొనసాగిస్తున్నారు.