కేంద్ర‌మంత్రిని అలా సంబోధిస్తారా..? లోకేశ్ వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దం

కేంద్ర‌మంత్రిపై నోరుపారేసుకున్న మంత్రి లోకేశ్‌

దావోస్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జ్యూరిచ్‌లో తెలుగు పారిశ్రామిక వేత్త‌ల‌తో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు బృందం స‌మావేశ‌మైంది. ఈ స‌మావేశం ఆద్యంతం రాజ‌కీయ పార్టీ మీటింగ్‌లా జ‌రిగింద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ.. అందులో మంత్రి లోకేశ్ ప్ర‌సంగంలో చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారాయి.

స్టేజ్‌పైన తెలుగు పారిశ్రామిక వేత్త‌ల‌ను ఉద్దేశించి మొద‌ట మంత్రి టీజీ భ‌ర‌త్‌, కేంద్ర‌మంత్రి రామ్మోహ‌న్‌నాయుడు, త‌రువాత మంత్రి లోకేశ్‌, సీఎం చంద్ర‌బాబు ప్ర‌సంగించారు. లోకేశ్ వేదిక‌పై ప్ర‌సంగిస్తూ ప‌ద‌విలో త‌న‌కంటే పెద్ద స్థాయిలో ఉన్న రామ్మోహ‌న్‌నాయుడిని ‘అరేయ్, ఏరా’ అంటూ సంబోధించారు. దీంతో అక్క‌డున్న‌వారంతా ఒక్క‌సారిగా అవాక్క‌య్యారు.

వారి ఇద్దరి మ‌ధ్య స‌న్నిహిత సంబంధాలు ఉన్న‌ప్ప‌టికీ యూనియ‌న్ కేబినెట్‌లో కేంద్ర పౌర విమానాయన శాఖమంత్రిగా ఉన్న‌ రామ్మోహన్ నాయుడును ఉద్దేశించి అరేయ్, ఏరా అని మాట్లాడ‌డం స‌మంజ‌సం కాద‌ని కాద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్రైవేట్ మీటింగ్‌లో మాట్లాడుకున్నా అభ్యంత‌రం ఉండేది కాద‌ని, ప‌బ్లిక్ మీటింగ్ ఇలా సంబంధించ‌డం, అదీ పారిశ్రామికవేత్తల ముందు వ్యాఖ్యానించ‌డం వివాదంగా మారింది. లోకేశ్ తీరుపై విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. బలహీనవర్గాలకు చెందిన కేంద్రమంత్రిపై ఇలా నోరుపారేసుకోవ‌డం సరికాద‌ని సూచిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment