మచిలీపట్నం (Machilipatnam)లో జరిగిన సభలో మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) రెడ్బుక్ (Red Book)పై సంచలన వ్యాఖ్యలు (Sensational Comments) చేశారు. తమ ప్రభుత్వంలో కక్షసాధింపు రాజకీయాలకు తావు లేదంటూనే “రెడ్బుక్ అనే పేరు చెబితే చాలు, వైసీపీ నేతలకు గుండెపోటు వస్తోంది. ఒకడు బాత్రూమ్లో జారి చేయి విరగగొట్టుకున్నాడు, మరొకడు ఏదేదో మాట్లాడాడు” అంటూ వైసీపీ నేతలపై రెచ్చిపోయి మాట్లాడారు. మంత్రి నారా లోకేష్ సభలో మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, వర్ల కుమార్ రాజా తదితరులు పాల్గొన్నారు.
ఏ తల్లీ ఇబ్బంది పడకూడదని
మంత్రి లోకేశ్ “తల్లికి వందనం”(Thalliki Vandanam) పథకాన్ని అమలు చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. “పిల్లలను చదివించేందుకు ఏ తల్లీ ఇబ్బంది పడకూడదనే సంకల్పంతో ఈ పథకాన్ని తమ ప్రభుత్వం అమలు చేస్తున్నట్లుగా మంత్రి లోకేష్ చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలను కించపరిచేలా నాయకులు మాట్లాడారు. కానీ, మా కూటమి ప్రభుత్వంలో మహిళలకు సముచిత గౌరవం లభిస్తుంది” అని హామీ ఇచ్చారు. త్వరలో పాఠశాలల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు.
మళ్లీ తల్లి గురించి ప్రస్తావన
రెడ్బుక్ గురించి మాట్లాడుతూ.. తాము ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తున్నాం. అందుకే మా నిర్ణయాలను ఎవరూ ప్రశ్నించలేకపోతున్నారు అని లోకేశ్ తెలిపారు. ఈ సందర్భంగా తన తల్లి భువనేశ్వరి గురించి కూడా లోకేష్ ప్రస్తావించడం గమనార్హం. తన గురించి మాట్లాడినా పర్వాలేదని, తన తల్లి గురించి మాట్లాడినప్పుడు తాను ఫిక్స్ అయిపోయానని, తన టైమ్ వస్తోంది అప్పుడు మీ సంగతి చూస్తా అనుకున్నాను అంటూ వైసీపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మచిలీపట్నం సభలో పదే పదే రెడ్బుక్ గురించి ప్రస్తావిస్తూ.. దాన్ని చూసి వైసీపీ నేతలు భయపడుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు.
కాగా దీనిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మంత్రి లోకేష్ ఏడాది పరిపాలనలో ఫలానా మంచి చేశామని చెప్పకపోగా, అంబేద్కర్ రాజ్యాంగాన్ని విరుద్ధంగా ఆంధ్రరాష్ట్రంలో నడుస్తున్న “రెడ్బుక్” రాజ్యాంగం గురించి ప్రస్తావిస్తున్నాడని, అదేదో పెద్ద ఘనతలా ప్రచారం చేసుకుంటున్నాడని వైసీపీ శ్రేణులు విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగేతర శక్తిలా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.