జ‌గ‌న్‌పై రెండుసార్లు హ‌త్యాయ‌త్నం చేయించింది బాబే.. – ల‌క్ష్మీపార్వ‌తి సంచ‌ల‌న వ్యాఖ్య‌

జ‌గ‌న్‌పై రెండుసార్లు హ‌త్యాయ‌త్నం చేయించింది బాబే.. - ల‌క్ష్మీపార్వ‌తి సంచ‌ల‌న వ్యాఖ్య‌

ఏపీ మంత్రులు నారా లోకేశ్‌, అచ్చెన్నాయుడుపై వైసీపీ సీనియ‌ర్ నేత నంద‌మూరి ల‌క్ష్మీపార్వ‌తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాడేప‌ల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో ల‌క్ష్మీపార్వ‌తి విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న‌న్న విద్యా కానుక‌పై వైఎస్ జ‌గ‌న్ ఫొటోలున్నాయ‌ని అసెంబ్లీలో మంత్రి లోకేశ్ చేసిన కామెంట్ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు. చంద్రబాబు హయాంలో ప్రతి చెట్టు, పుట్టకు పచ్చ రంగులు వేయలేదా?. చంద్రన్న తోఫా పేరుతో సంచుల మీద కూడా చంద్రబాబు ఫోటోలు వేయలేదా? అని ప్ర‌శ్నించారు.

లోకేశ్‌, అచ్చెన్న నెల ఎక్కువ బాలురు
అసెంబ్లీలో లోకేశ్ ఫొటో ప్ర‌ద‌ర్శించిన స‌మ‌యంలో నెల త‌క్కువ బాలుడిలా ఉన్నాడంటూ వెనుక నుంచి అచ్చెన్నాయుడు కామెంట్స్‌పై నంద‌మూరి ల‌క్ష్మీపార్వ‌తి మండిప‌డ్డారు. నారా లోకేశ్‌, అచ్చెన్నాయుడు మీరు నెల ఎక్కువ బాలురా..? 11 నెల‌ల‌కు పుట్టారా..? అందుకే అంత లావుగా ఉన్నారు.. అంటూ ల‌క్ష్మీపార్వ‌తి వేసిన సెటైర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

వివేకా హ‌త్య కేసుపై శాస‌న‌స‌భ‌లో చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌కు ల‌క్ష్మీపార్వ‌తి కౌంట‌ర్ ఇచ్చారు. కుట్ర‌, కుతంత్రానికి ప్ర‌తిబింబిం, హత్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని ఆరోపించారు. తన చేతికి మట్టి అంటకుండా పని కానిచ్చే వ్యక్తి అని విమ‌ర్శించారు. చంద్ర‌బాబు రాజ‌కీయ జీవితం అంతా కుట్ర‌లు, హ‌త్యా రాజ‌కీయాలేన‌న్నారు. జగన్, ఆయన కుటుంబ సభ్యుల మీద పచ్చిగా మాట్లాడుతున్న వారిపై కేసులు, శిక్షలు ఎందుకు విధించటం లేద‌ని ల‌క్ష్మీపార్వ‌తి ప్ర‌శ్నించారు.

జగన్ తెచ్చిన పథకాలను కాపీ కొట్టటానికి సిగ్గులేదా చంద్రబాబూ? అని ప్ర‌శ్నించారు. జ‌గన్‌పై రెండు సార్లు హత్యాయత్నం చేయించిన నీచుడు చంద్రబాబు అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పోలీసుల మీద దాడులు చేయించిన వ్యక్తి చంద్రబాబేన‌ని, ఆయ‌న నీచ, హత్యా రాజకీయాలు ప్రజలందరికీ తెలుసన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment