సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) కాంగ్రెస్ పార్టీ (Congress Party)పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గుజరాత్లోని ఏక్తానగర్లో జరిగిన వేడుకల్లో మాట్లాడిన ఆయన, కాశ్మీర్ సమస్య రావడానికి నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ (Nehru) అనుసరించిన బలహీన విధానాలే కారణమని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ చేసిన తప్పుల కారణంగానే కాశ్మీర్ (Kashmir)లో కొంత భాగం పాకిస్థాన్ అక్రమ ఆక్రమణలోకి వెళ్ళిందని, దశాబ్దాలుగా ఆ పార్టీ ఉగ్రవాదం ముందు తలవంచిందని ఆరోపించారు. సర్దార్ పటేల్ దార్శనికతను కాంగ్రెస్ విస్మరించిందని, అయితే తమ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి పటేల్ ఆశయాలను నెరవేర్చిందని మోడీ స్పష్టం చేశారు.
అంతేకాక, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ అంతర్గత భద్రతను విస్మరించిందని మోడీ(Modi) ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ భద్రతకు ముప్పుగా పరిణమించిన అర్బన్ నక్సలైట్లు మరియు వారికి మద్దతు ఇచ్చేవారిని కూడా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఏక్తా పరేడ్ ఆకట్టుకుంది. పూర్తిగా మహిళల ఆధ్వర్యంలో జరిగిన గార్డ్ ఆఫ్ ఆనర్ మరియు ఫ్లాగ్ మార్చ్ అద్భుతంగా సాగింది. పరేడ్లో సాయుధ దళాల ప్రదర్శనలు, మార్షల్ ఆర్ట్స్ మరియు భారత వైమానిక దళం యొక్క వైమానిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.








