న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్గా మిచెల్ సాంట్నర్ను నియమించినట్లు కివీస్ క్రికెట్ బోర్డ్ అధికారికంగా ప్రకటించింది. వన్డే, టీ20 ఫార్మాట్లలో జట్టును ముందుండి నడిపించే బాధ్యతలు ఇప్పుడు సాంట్నర్కు అప్పగించారు.
కెప్టెన్సీపై మిచెల్ సాంట్నర్ స్పందిస్తూ.. ఇది తనకు లభించిన గొప్ప గౌరవమని, చిన్ననాటి నుండి జట్టుకు సారథ్యం వహించాలని కన్న కల నెరవేరిందన్నారు. తనకు ఇప్పుడు సారథ్య బాధ్యతలు రావడం ప్రత్యేకమైనదిగా సాంట్నర్ వ్యాఖ్యానించాడు. ఈ నెలాఖరులో శ్రీలంకతో ప్రారంభం కానున్న సిరీస్లో శాంట్నర్ పూర్తి స్థాయి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు.