యలమంచిలి (Yalamanchili) టీడీపీ (TDP) కార్యకర్తల సభలో మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) చేసిన వ్యాఖ్యల్లో ఏమాత్రం నిజం లేదట. మండలి (Assembly) లో ఆరోజు జరిగిన సంఘటనను లోకేశ్ రివర్స్ చేసి చెబుతున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. సోమవారం యలమంచిలి సభలో కౌన్సిల్లో బీదా రవి (Bida Ravi), బీటెక్ రవి (B.Tech Ravi) ఒక మంత్రిని గట్టిగా తన్నారు. ఆ విషయం బయటకు రాలేదు.. వాళ్లు చెప్పుకోలేదు.. అని వ్యాఖ్యానించారు. లోకేశ్ ప్రకటన పూర్తిగా కొట్టిపారేస్తున్నారు. యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) అభ్యర్థనను వైసీపీ సభ్యులు పరిగణనలోకి తీసుకోవడం వల్లే నారా లోకేశ్ సభ నుంచి సల్లగా బయటపడ్డాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఆరోజు శాసనమండలిలో ఏం జరిగిందంటే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సుస్థిర సమగ్ర అభివృద్ధి (Stable Overall Development), అధికార వికేంద్రీకరణ బిల్లు (Decentralization Bill) అసెంబ్లీలో ఆమోదం పొందడంతో శాసనమండలిలో ప్రవేశపెట్టారు. ఆ సందర్భంలో అప్పటి మండలిలో టీడీపీ బలంగా ఉండటంతో అధికారం లేకపోయినా సరే, ఆ బిల్లును అడ్డుకునేందుకు చంద్రబాబు మండలి గ్యాలరీలో కూర్చొని చైర్మన్ షరీఫ్ (Sharif) ను ప్రభావితం చేశారట. రాజ్యాంగ విరుద్ధంగా మండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. వైసీపీ మంత్రులు, సభ్యులు మండలిలో ఆందోళనకు దిగడంతో లోకేశ్ వెంటనే తన ఫోన్ తీసుకొని సభ నియమావళికి విరుద్ధంగా వీడియోను చిత్రీకరిస్తూ శాసన వ్యవస్థను అపహాస్యం చేసేలా ప్రవర్తించాడని సమాచారం. దీనిపై వైసీపీ (YCP) మంత్రులు, సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య మండలిలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే వైసీపీ సభ్యులను ఉద్దేశించి లోకేశ్ వెకిలిగా, హేళనగా మాట్లాడడంతో పరిస్థితి మరింత వేడిగా తయారైందట.
ఇదే సమయంలో ఇద్దరు మంత్రులు నారా లోకేశ్ వైపు ఆగ్రహంతో దూసుకెళ్లి.. వీడియో చిత్రీకరించడం సభ్యత కాదని వార్నింగ్ (Warning) ఇచ్చారట. ఈ నేపథ్యంలో మండలిలోని టీడీపీ సభ్యుడు యనమల రామకృష్ణుడు వైసీపీ మంత్రుల వద్దకు వచ్చి దయచేసి వదిలేయాలని అభ్యర్థించారని సమాచారం. సీనియర్ సభ్యుడు యనమల అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న వైసీపీ మంత్రులు, సభ్యులు శాంతించడంతో లోకేశ్ సల్లగా సభ నుంచి జారుకున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. దీన్నే నారా లోకేశ్ రివర్స్ (Reverse) చేసి చెప్పాడని, లోకేశ్ మాటల్లో నిజాయితీ (Truthfulness) లేదని ఈ సంఘటన గురించి పూర్తిగా తెలిసిన రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు
— Telugu Feed (@Telugufeedsite) March 31, 2025
శాసనమండలిలో మంత్రిగా ఉన్న వ్యక్తిని టీడీపీ Mlc బీదా రవి, బీటెక్ రవి గట్టిగా తిన్నారు.
ఆ విషయం బయటకు రాలేదు. వాళ్లు చెప్పుకోలేదు. ఎందుకంటే చెప్పుకుంటే పరువుపోతుంది అని..
సంచలన విషయాన్ని బయటపెట్టిన #NaraLokesh@JaiTDP @YSRCParty#AndhraPradesh #YSRCP pic.twitter.com/NhoTgiv2wY