అగ్ర‌రాజ్యంలో కార్చిచ్చు అరాచ‌కం.. రూ.21 లక్షల కోట్ల నష్టం

అగ్ర‌రాజ్యంలో కార్చిచ్చు అరాచ‌కం.. రూ.21 లక్షల కోట్ల నష్టం

లాస్ ఏంజిల్స్‌ ను వైల్డ్ ఫైర్ దహనం చేస్తోంది. జనవరి 26న మొదలైన ఈ అగ్ని ప్రమాదం ప్రస్తుతం హాలీవుడ్ నగరం పరిసరాలను కమ్మేసింది. దీంతో గత వారం రోజులుగా ఈ ప్రాంతం మంటల్లో కాలిపోతుంది. అమెరికాలో అత్యంత ధనవంతుల ప్రాంతంగా పేరుగాంచిన ఈ ప్రాంతంలో అనేక ప్రముఖులు, సినీ నటులు, వ్యాపారవేత్తల నివాసాలు ఉన్నాయి.

నష్టం వివరాలు
ఈ వైల్డ్ ఫైర్‌ కారణంగా గడచిన వారం రోజుల్లోనే 21 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లింది. అగ్ని ప్రమాదంలో 12 వేల ఇండ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 16 మంది మరణించారు, 24 మంది ఆచూకీ లభించలేదు. బంగారం, డైమండ్లు, నగదు వంటి అనేక విలువైన వస్తువులు మంటల్లో కాలిపోయాయి.

మంటలను ఆర్పడంలో అవరోధాలు
గాలి వేగం 80-113 కిలోమీటర్లకు పెరుగుతుండటంతో మంటలు మరింత విస్తరిస్తున్నాయి. నిప్పులు చెలరేగి మళ్లీ మంటలు ప్రబలే పరిస్థితి ఏర్పడుతోంది. స్థానిక అధికారులు వచ్చే మూడు రోజుల్లో మరింత భారీ మంటల ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment