చిత్తూరు జిల్లా (Chittoor District)లోని కుప్పం నియోజకవర్గం (Kuppam Constituency), ముఖ్యమంత్రి (Chief Minister) నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో జరిగిన ఒక దారుణ ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో (Narayana Puram Village) శిరీష (Sirisha) (25) అనే మహిళను (Woman) తన కన్నకొడుకు ముందే చెట్టు (Tree)కు కట్టేసి, అభస్యకరంగా దూషిస్తూ, మొహంపై ఉమ్మేసి, కర్రలతో(Sticks) దాడి(Attack) చేసిన దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పు తీర్చలేదన్న కారణంతో టీడీపీ కార్యకర్త (TDP Activist) మహిళపై దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో శిరీష కుమారుడు బోరున విలపిస్తున్న తీరు కళ్లుచమర్చుతోంది. ఈ అమానవీయ ఘటన స్థానికులను ఆగ్రహానికి గురిచేసింది.
వివరాల్లోకి వెళితే.. మూడేళ్ల క్రితం శిరీష భర్త తిమ్మరాయప్ప (Thimmarayappa), గ్రామానికి చెందిన మునికన్నప్ప (Munikannappa) వద్ద రూ.80,000 అప్పు తీసుకోగా, దానిని చెల్లించలేక ఊరు వదిలి వెళ్లిపోయాడు. కూలి పనులు చేస్తూ పిల్లలను పిల్లలు పోషించుకుంటూ అప్పులు తీరుస్తోంది. సకాలంలో చెల్లించలేదని రోడ్డుపై వెళ్తుండగా శిరీష గురించి అసభ్యకరమైన పదజాలంతో దూషించి తన అప్పు డబ్బులు ఇవ్వకపోతే చంపిస్తామని బెదిరింపులకు గురిచేశాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
శిరీష రోడ్డుపై వెళ్తుండగా, మునికన్నప్ప ఆమెను అసభ్య పదజాలంతో దూషించి, అప్పు చెల్లించకపోతే చంపేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత ఆమెను బలవంతంగా ఈడ్చుకెళ్లి వేప చెట్టుకు కట్టేసి, కర్రతో దాడి చేయడమే కాకుండా మొహంపై మరో మహిళ ఉమ్మేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ ఘటనను స్థానికులు కుప్పం పోలీసులకు తెలియజేయడంతో, వారు విచారణ ప్రారంభించారు. అయితే, ఈ దాడి చేసిన వ్యక్తి అధికార పక్షమైన టీడీపీ కార్యకర్తగా ఉండటం వివాదాస్పదంగా మారింది.
ఈ ఘటనపై స్థానికులతో పాటు పలు మహిళా సంఘాలు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి (Chief Minister) సొంత నియోజకవర్గం (Own Constituency)లో ఇలాంటి దారుణం జరగడం సిగ్గుచేటని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నేషనల్ మహిళా హక్కుల కమిషన్ (National Women Rights Commission) ఈ ఘటనపై స్వీకరించి, న్యాయం చేయాలని కోరుతున్నారు. కన్న కొడుకు ముందు తల్లిని ఇంత దారుణంగా చిత్రహింసలకు గురిచేయడం మానవత్వం లేని చర్యగా అభివర్ణిస్తున్నారు. ఈ ఘటన కుప్పం నియోజకవర్గంలో రాజకీయంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది, మహిళల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
సీఎం చంద్రబాబు #Kuppam నియోజకవర్గంలో దారుణం..
— Telugu Feed (@Telugufeedsite) June 17, 2025
కొడుకు కళ్ళముందే తల్లిని చెట్టుకు కట్టేసి కొడుతుంటే బోరున ఏడుస్తున్న బాలుడు..
కుప్పంలో అప్పు డబ్బుల కోసం మహిళను చెట్టుకు కట్టేసి… కర్రతో దాడి చేయడమే కాకుండా మొహంపై ఉమ్మేసి .. అసభ్యకరంగా సాటి మహిళ ప్రవర్తన#AndhraPradesh… https://t.co/v9MCSFYjBm pic.twitter.com/hbPQLbn3i3