శేఖర్ కమ్ముల (Shekhar Kammula) దర్శకత్వంలో ధనుష్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న భారీ సినిమా ‘కుబేర (‘Kubera’)’ నుంచి తొలి సాంగ్ (First Song) విడుదలైంది. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన ‘పోయిరా మావా (‘Poiyra Maava’)’ అనే పాటను స్వయంగా ధనుష్ (Dhanush) పాడడం విశేషం. ఈ పాటకు ప్రముఖ లిరిసిస్ట్ భాస్కర్ భట్ల (Bhaskar Bhatla) సాహిత్యం అందించగా, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) అలవోకగా ట్యూన్ కంపోజ్ చేశారు. పాటలోని ఉత్సాహభరితమైన మ్యూజిక్, రొమాంటిక్ టచ్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.
ఈ చిత్రాన్ని జూన్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. తొలి పాటకు వచ్చిన రెస్పాన్స్ చూస్తే, కుబేర సినిమా సంగీతం ఎంత ప్రత్యేకంగా ఉండబోతుందో స్పష్టమవుతోంది.