కేటీఆర్‌పై విచారణ.. గవర్నర్ ఆమోదంతో చర్యలకు సిద్ధ‌మ‌వుతున్న‌ ఏసీబీ

కేటీఆర్‌పై విచారణ.. గవర్నర్ ఆమోదంతో ఏసీబీ చర్యలు సిద్ధం

ఈ-ఫార్ములా రేసు కేసులో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విచారించ‌డానికి గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ-కారు రేసు అంశంలో అవినీతి ఆరోపణల నేపథ్యంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి వివ‌రించారు. గవర్నర్ న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కేబినెట్‌ సమావేశంలో కేటీఆర్‌ ఈ-కార్‌ రేసుపై సమగ్రంగా చర్చించామని మంత్రి పొంగులేటి చెప్పారు. కేటీఆర్‌ను అరెస్టు చేస్తారో లేదో తనకు తెలియదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఈ-కార్‌ రేసులో వచ్చిన పెట్టుబడుల లెక్క కూడా ఏసీబీ తేలుస్తుందని చెప్పారు. ఈ విషయంలో అప్పటి మున్సిపల్‌ శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్‌పైనా విచారణ జరుగుతుందన్నారు. తాము కక్షపూరితంగా వ్యవహరించడం లేదన్నారు

ఈ-ఫార్ములా రేసు కేసులో త్వరలోనే కేటీఆర్‌కు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నోటీసులు జారీ చేయనుందని అంచనా. ఏసీబీ ఈ అంశంపై దర్యాప్తు ప్రారంభించడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment