సీనియర్ జర్నలిస్ట్ (Senior Journalist), సాక్షి టీవీ యాంకర్ (Sakshi TV Anchor) కొమ్మినేని శ్రీనివాసరావు (Kommineini Srinivasarao)కు మంగళగిరి కోర్టు (Mangalagiri Court) 14 రోజుల జుడీషియల్ రిమాండ్ (14-day Judicial Remand) విధించింది. టీవీ డిబేట్ (TV debate)లో అమరావతి మహిళల (Amaravati Women)పై అసభ్య వ్యాఖ్యల కేసులో ఈనెల 24 వరకు రిమాండ్ విధిస్తున్నట్లుగా కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఆయన్ను గుంటూరు జిల్లా జైలుకు (Guntur District Jail) తరలించినట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం హైదరాబాద్ (Hyderabadలోని జర్నలిస్ట్స్ కాలనీలోని తన నివాసంలో కొమ్మినేనిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. సాక్షి టీవీలో జూన్ 6న ప్రసారమైన ‘కేఎస్ఆర్ లైవ్ షో’లో పాల్గొన్న కృష్ణంరాజు అనే ప్యానల్ సభ్యుడు చేసిన వ్యాఖ్యలకు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు (Arrested) చేశారు.
కృష్ణంరాజు (Krishnamraju) వ్యాఖ్యలను తాను ఖండించి క్షమాపణలు (Apologized) చెప్పినప్పటికీ, తనను అరెస్టు చేశారని, 70 ఏళ్ల వయస్సులో తన వరకు టీడీపీ రెడ్బుక్ రాజ్యాంగం (TDP Red Book Constitution) వచ్చిందని కొమ్మినేని అరెస్ట్ సందర్భంలో చెప్పారు. గతంలో ఓ టీవీ ఛానల్ నుంచి ఉద్యోగం తీయించిన చంద్రబాబు.. ఇప్పుడు తనను వ్యక్తిగత కక్షతోనే అరెస్టు చేయించారని చెప్పారు.
కోర్టు విచారణ, రిమాండ్
ఇవాళ ఉదయం కొమ్మినేనిని గుంటూరు జనరల్ హాస్పిటల్కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ విధిస్తే కోర్టు ఇచ్చిన తీర్పు అనంతరం కొమ్మినేనిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. మీడియా వర్గాల్లో కూడా ఈ అరెస్టు వివాదాస్పదంగా మారింది. కొందరు విశ్లేషకులు ఈ అరెస్టు వైసీపీ అనుకూల మీడియాను లక్ష్యంగా జరిగినట్లుగా చర్చిస్తున్నారు.