సీనియర్ జర్నలిస్ట్ (Senior Journalist), సాక్షి టీవీ యాంకర్ (Sakshi TV Anchor) కొమ్మినేని శ్రీనివాసరావు (Kommineni Srinivasa Rao)పై అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యల కేసులో నమోదైన సెక్షన్లపై మంగళగిరి కోర్టు న్యాయమూర్తి (Mangalagiri Court Judge) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ (SC/ST Atrocities Act), భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 356(2) అభియోగాలను తొలగించాలని న్యాయమూర్తి ఆదేశించారు. కొమ్మినేనిపై నమోదు చేసిన సెక్షన్లపై డీఎస్పీ (DSP), ఎస్పీ (SP) ఇద్దరు ఉన్నతాధికారులకు మెమో (Memo) జారీ చేశారు. ఎఫ్ఐఆర్(FIR)లో తప్పుడు సెక్షన్లు నమోదు చేసిందుకు జడ్జి అసంతృప్తి వ్యక్తం చేశారు.
జూన్ 6, 2025న సాక్షి టీవీలో ప్రసారమైన ‘కేఎస్ఆర్ లైవ్ షో’ (‘KSR Live Show’)లో కృష్ణంరాజు (Krishnamraju) అనే వ్యక్తి అమరావతి మహిళల (Amaravati womens)పై అనుచిత వ్యాఖ్య చేశాడు. దీనిపై 24 గంటల తరువాత అమరావతి మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. వివాదాస్పద వ్యాఖ్య చేసిన కృష్ణంరాజుతో పాటు జర్నలిస్ట్ కొమ్మినేనిపై, సాక్షి టీవీ ఛానల్ యాజమాన్యంపై రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ (State Madiga Corporation Director) కంభంపాటి శిరీష (Kambhampati Sirisha), అమరావతి మహిళల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ప్యానల్ సభ్యుడి మాటలకు జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు క్షమాపణలు కోరినప్పటికీ.. సోమవారం ఆయన్ను అరెస్టు చేశారు. ఆయనపై నమోదైన సెక్షన్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, 356(2) కూడా ఉన్నాయి.
న్యాయమూర్తి ఆగ్రహం
మంగళగిరి కోర్టులో జరిగిన విచారణలో న్యాయమూర్తి కొమ్మినేనిపై నమోదైన అభియోగాలపై తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా ఈ కేసుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. “ఈ వ్యాఖ్యలు నిర్దిష్టంగా షెడ్యూల్డ్ కులాలు లేదా తెగలను లక్ష్యంగా చేసినట్లు సాక్ష్యం లేదు. అలాంటప్పుడు ఈ చట్టాన్ని ఎలా వర్తింపజేస్తారు?” అని న్యాయమూర్తి పోలీసు అధికారులను నిలదీశారు. అలాగే, గతంలో ఇలాంటి కేసుల్లో సెక్షన్ 356(2) (క్రిమినల్ ఇంటిమిడేషన్) వంటి అభియోగాలను వర్తింపజేయవద్దని సూచించినప్పటికీ, మళ్లీ అదే సెక్షన్ను ఉపయోగించడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. “గతంలో స్పష్టమైన సూచనలు ఇచ్చినా, ఈ సెక్షన్లను ఎందుకు వర్తింపజేశారు?” అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఎస్సీ/ఎస్టీ యాక్ట్, సెక్షన్ 356(2) అభియోగాలను తొలగించాలని ఆదేశించారు. కేసులో డీఎస్పీ, ఎస్పీలకు న్యాయమూర్తి మెమో జారీ చేశారు.