విజయవాడ ఎంపీ (Vijayawada MP), తెలుగుదేశం పార్టీ (TDP) నేత కేశినేని చిన్ని (Keshineni Chinni)పై మాజీ ఎంపీ కేశినేని నాని (Keshineni Nani) సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికే విశాఖ (Visakhapatnam) భూ వివాదంపై ఆరోపణలు చేసిన నాని.. ఇప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తున్న మద్యం కేసులో చిన్ని పాత్రపై నేరుగా సీఎం చంద్రబాబు నాయుడుకు (CM Chandrababu Naidu) లేఖ రాశారు. ఈ లేఖను ఎక్స్ (ట్విట్టర్)లో కూడా పోస్ట్ చేశారు.
లిక్కర్ స్కాంలో ‘చిన్ని’ ప్రమేయం
మద్యం కుంభకోణం (Liquor Scam) లో అరెస్ట్ అయిన కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (Keesireddy Rajashekar Reddy) మరియు అతని సహాయకుడు దిలీప్ పైలాలకు ఎంపీ చిన్నితో సంబంధం ఉన్నట్లు తీవ్రంగా ఆరోపించారు. ముఖ్యంగా ఈ ఇద్దరితో పాటు చిన్ని భార్య జానకీ లక్ష్మీ కూడా ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ LLP (Pryde Infracon LLP) అనే కంపెనీలో భాగస్వాములుగా ఉన్నారని చెప్పారు. ఈ కంపెనీ హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉండగా, అదే చిరునామాతో ఇషాన్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Eshanvi Infra Projects Pvt. Ltd) అనే సంస్థ కూడా ఉందన్నారు. ఈ రెండు సంస్థలు ఒకే మెయిల్ ఐడీని ఉపయోగిస్తున్నాయని, ఇది ఉద్దేశపూర్వక భాగస్వామ్యాన్ని సూచిస్తుందంటూ నాని ఆరోపించారు.
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విదేశీ కంపెనీలు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో కుంభకోణంతో వచ్చిన నిధులను పెట్టుబడిగా మళ్లించినట్లు విశ్వసనీయ సమాచారం ఉందని నాని తెలిపారు. ఇది నిధుల లాండరింగ్కు ఉదాహరణ కావచ్చని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు నాయుడు తక్షణమే జోక్యం చేసుకోవాలని, సీబీఐ (CBI) లేదా సమర్థవంతమైన ఏజెన్సీతో విచారణ జరపించాలని నాని లేఖలో కోరారు. రాజకీయ సంబంధాలు న్యాయ ప్రక్రియకు అడ్డుపడకుండా చూడాలని స్పష్టం చేశారు.
ఇటీవల ప్రభుత్వం రూ.10 లక్షల మూలధనంతో ఏర్పాటైన ఉర్సా కంపెనీకి విశాఖపట్నంలో కోట్లు విలువ చేసే భూమిని కేటాయించడంపై కూడా కేశినేని నాని స్పందించారు. ఉర్సాకు భూకేటాయింపుల వెను టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని ఉన్నారని, ఆయన వ్యాపార భాగస్వామిదే ఆ కంపెనీ అని ఆధారాలతో సహా సీఎంకు లేఖ రాశారు. ఉర్సా భూకేటాయింపులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన విషయం తెలిసిందే. కేశినేని సోదరుల మధ్య నెలకొన్న వ్యక్తిగత విభేదాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ చర్చగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్ష మధ్య ఈ ఆరోపణల యుద్ధం ఎటు వెళుతుందో చూడాలి.
Respected @ncbn garu,
— Kesineni Nani (@kesineni_nani) May 5, 2025
I am writing this to bring to your urgent attention serious and credible information connecting the MP,Vijayawada, Kesineni Sivanath (Chinni), to individuals arrested in the Andhra Pradesh liquor scam, particularly Kesireddy Rajasekhar Reddy and his close… pic.twitter.com/pgiIbNtXZ5