ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణ చేశాడు. ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగుతుంది ఆప్. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్, బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు కేజ్రీవాల్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ రహస్యంగా పెట్టుకున్నాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీల మధ్య భిన్న అభిప్రాయాలు బయట పెడుతున్నా, తెరవెనుక వారు అనుబంధాలు కొనసాగిస్తున్నారని చెప్పారు.
తెరవెనుక రహస్య పొత్తు ఆమోదయోగ్యం కాదు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు అయినా కాంగ్రెస్, బీజేపీలు తమ పొత్తును అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని ఎవరూ సీరియస్గా తీసుకోవడం లేదన్నారు. పంజాబ్లోని ఆప్ ప్రభుత్వం తమ వాగ్దానాలను నెరవేర్చాలని ఢిల్లీలోని తన నివాసం ఎదుట మహిళలు చేపట్టిన నిరసనపై కేజ్రీవాల్ స్పందించారు. వారిని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే పంపించాయని, ఆందోళన చేపట్టిన వారు పంజాబ్ మహిళలు కాదని, వారంతా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందినవారని కేజ్రీవాల్ ఆరోపించారు.