‘బేబీ జాన్’ చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టిన నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేశ్, ఇప్పుడు మరో ప్రయోగాత్మక పాత్రకు సిద్ధమవుతోంది. బాలీవుడ్ తాజా సమాచారం ప్రకారం.. దేశంలో నేటి విద్యా వ్యవస్థను ప్రాతినిధ్యం చేసే ఓ సినిమాకు ఆమె సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు రాజ్కుమార్రావు హీరోగా నటించనున్నారు.
ఈ చిత్రాన్ని ‘సెక్టార్ 36’ సినిమాతో డైరెక్టర్గా మంచి పేరు సంపాదించుకున్న దర్శకుడు ఆదిత్య నింబాల్కర్ తెరకెక్కించబోతున్నారు. జూన్ నెలలో ముంబైలో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. కీర్తి సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. ఆమె ఈ సినిమాలో ఓ విద్యావేత్త పాత్రను పోషించనుందని తెలుస్తోంది. ఈ సినిమా కీర్తి కెరీర్లో కొత్త మలుపు తిప్పనుంది ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు.
పెళ్లి తరువాత కీర్తిసురేష్ సైన్ చేసిన తొలి ప్రాజెక్టు కావడం విశేషం. గతేడాది డిసెంబర్లో హీరోయిన్ కీర్తి సురేష్ తన చిరకాల స్నేహితుడు ఆంటోనీని పెళ్లి చేసుకుంది. గోవాలో వీరిద్దరి పెళ్లి హిందూ సంప్రదాయ ప్రకారం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. పెళ్లి తరువాత బేబీ జాన్ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న కీర్తి.. చాలా రోజుల తరువాత దర్శకుడు ఆదిత్య నింబాల్కర్ సినిమాలో నటించేందుకు అంగీకరించినట్లుగా సమాచారం.