కాశీబుగ్గ తొక్కిసలాట.. ప్రధాని దిగ్భ్రాంతి, సాయం

కాశీబుగ్గ తొక్కిసలాట.. ప్రధాని దిగ్భ్రాంతి, సాయం

శ్రీకాకుళం (Srikakulam) జిల్లా కాశీబుగ్గ (Kashibugga)వెంకటేశ్వరస్వామి ఆలయం (Venkateswara Swamy)లో జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటన చాలా బాధాకరమని, భక్తుల ప్రాణనష్టం తనను తీవ్రంగా కలచివేసిందని ప్రధాని (Prime Minister) తెలిపారు. తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై పీఎంఓ నుంచి ట్వీట్ చేశారు.

ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, గాయాల పాలైన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50 వేలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించినట్లు ప్రధాని కార్యాలయం (PMO) అధికారికంగా తెలిపింది.

Join WhatsApp

Join Now

Leave a Comment