పాకిస్తాన్ వెళ్తున్నా.. యుద్ధం ఆపేస్తా.. – కేఏ పాల్ సంచలన వ్యాఖ్య

పాకిస్తాన్ వెళ్తున్నా.. యుద్ధం ఆపేస్తా.. - కేఏ పాల్ సంచలన వ్యాఖ్య

భారత్–పాకిస్తాన్ (India–Pakistan) మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ, ప్రజాశాంతి పార్టీ (Praja Shanti Party) అధ్యక్షుడు కేఏ పాల్ (K.A. Paul) సంచలన ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తాను ఆపేస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు. అనంతపురం (Anantapur) లో మీడియాతో మాట్లాడుతూ.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు కేఏ పాల్‌. భారత్–పాకిస్తాన్ మధ్య రాత్రి పగలు తేడా లేకుండా చర్చలు జరుగుతున్నాయట. ఇటీవల ఆయన అమెరికా (USA) లో మూడు రోజులపాటు గడిపి, ప్రముఖ రాజకీయ నాయకులతో రహస్య సమావేశాలు నిర్వహించారట. “యుద్ధాన్ని ఆపగల శక్తి మీకే ఉంది” అని వారు చెప్పినట్టు పాల్ ప్ర‌క‌టించుకున్నారు.

మోడీ, షాని కలిసిన తర్వాత..
భారత్ చేసిన వాయుసేన దాడుల (Air Strikes) నేపథ్యంలో మే 10 శనివారం ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi), కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah)లను కలిసి పాకిస్తాన్ వెళ్తున్నట్లు పాల్ తెలిపారు. ఆదివారం పాకిస్తాన్ వెళ్లి అక్కడ శాంతి చర్చలు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వెల్లడించారు. తాను ఇప్పటికే 2002లో మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు కూడా పాకిస్తాన్ వెళ్లిన విషయాన్ని గుర్తుచేశారు. భారత్ “ఆపరేషన్ సింధూర్” (Operation Sindoor) ద్వారా టెర్రరిస్టులే లక్ష్యంగా తీసుకుంటోందన్నారు.

జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ సీఎం వైఎస్ జగన్ (Y.S. Jagan)పై కూడా కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ అసలు క్రిస్టియన్ కాదని, చిన్నజీయర్ స్వామిని అనుసరించే భక్తుడని సంచలన కామెంట్స్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ హత్య (Pastor Praveen Murder Case) కేసుపై కూడా కేఏ పాల్ స్పందించారు. ఈ హత్య కేసును హత్య కోణంలో దర్యాప్తు చేయాలంటూ హైకోర్టును (High Court) కోరినట్లు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment