తిరుమల కొండపై దేవర బ్యూటీ సందడి చేశారు. ప్రముఖ సినీ నటి జాన్వీ కపూర్ శనివారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో తన సన్నిహితులతో కలిసి శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వైకుంఠం వద్ద టీటీడీ అధికారులు ఆమెకు ప్రత్యేక స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనాలు పొందారు. అనంతరం ఆలయ అధికారులు జాన్వీకి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల కొండపై శ్రీవారి దర్శనం అనంతరం జాన్వీకపూర్తో పలువురు సెల్ఫీలు, ఫొటోలు దిగారు. జాన్వీ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కొత్తేమీ కాదు. కాలినడకన కూడా ఆమె తిరుమల కొండపై చేరుకొని స్వామివారిని దర్శించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
News Wire
-
01
ఏపీ సీఎం ఏరియల్ సర్వే
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే. అమరావతి నుంచి హెలికాప్టర్ లో బయల్దేరిన ఏపీ సీఎం
-
02
మొంథా తుఫాన్ ఎఫెక్ట్
విజయనగరం జిల్లాలో 7వేల ఎకరాలు నేలవాలిన వరి. శ్రీకాకుళం జిల్లాలో 350 హెక్టార్లలో పంటనష్టం
-
03
మొంథా తుఫాన్ ప్రభావం
గాలులకు అరటి, కంద, బొప్పాయి పంటలు ధ్వంసం. ఉద్యాన పంటలకు తీవ్రనష్టం
-
04
మొంథా తుఫాన్ ప్రభావం
నేలరాలిన అరటి, బొప్పాయి తోటలు. తడిసిన పత్తి పంట
-
05
రైతుల పంటలు నీటిపాలు
శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు అన్ని చోట్లా దెబ్బతిన్న పంటలు..
-
06
టీడీపీ నేతల కాల్ మనీ ఆగడాలకు మహిళ బలి
టీడీపీ ఎమ్మెల్యే రామాంజనేయులు అనుచరుడు కల్లూరి శ్రీను వేధింపులతో ఈపూరి శేషమ్మ ఆత్మహత్య.
-
07
కాకినాడకు గ్రేట్ డేంజర్ సిగ్నల్
కాకినాడ పోర్టులో 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక. విశాఖ, గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నంలో డేంజర్ సిగ్నల్ 9 జారీ.
-
08
NTR వైద్యసేవలు నిలిపివేత
ఇప్పటికే స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ఆధ్వర్యంలో 650 ఆసుపత్రుల్లో సేవలు నిలిపివేత. అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో సేవలు నిలిపివేత.
-
09
నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.
ప్రధాని మోడీ అధ్యక్షతన జరగనున్న కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
-
10
కర్నూలులో బస్సు ప్రమాదం
కర్నూలులో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధం. బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది మృతి. బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు








