పిఠాపురం జ‌న‌సేన వీర మహిళకు షాక్..

పిఠాపురం జ‌న‌సేన వీర మహిళకు షాక్..

పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన జనసేన వీర మహిళ సుజాత‌కు ఊహించని షాక్ తగిలింది. కాకినాడ జిల్లాలో ఆమెపై పోలీసుల కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. ఈనెల 14న జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పిఠాపురంలో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. వేదిక‌పై జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి తనను కావాల‌నే దూరం పెట్టార‌ని సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి, జనసేన పిఠాపురం ఇంఛార్జి మారెడ్డి శ్రీనివాస్, టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో, జనసేన పార్టీ నేతలు పోలీసులను ఆశ్రయించగా, సుజాతపై అధికారికంగా కేసు నమోదైనట్లు సమాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment