ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్రమోడీ (Narendra Modi) తీసుకున్న నిర్ణయానికి వైసీపీ (YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister) వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) మద్దతు (Support) ఇచ్చారు. దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతోపాటే కుల గణన (Caste enumeration) కూడా చేపట్టాలని ప్రధాని మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిన్న ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ (సీసీపీఏ) సమావేశంలో కుల గణనకు ఆమోదం (Approval) తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మద్దతు పలికారు. కేంద్రం తీసుకున్న కుల గణన నిర్ణయంపై వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. కుల గణన చేయాలనే కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని జగన్ స్వయంగా ప్రకటించారు. 2021లోనే తమ ప్రభుత్వ హయాంలోనే కుల గణనపై తీర్మానం చేశామని, జనవరి 2024లో గ్రామ, వార్డు సచివాలయాల (Village and Ward Secretariats) ద్వారా దేశంలో మొట్టమొదటి బీసీ కుల గణన (BC Caste Census) ను నిర్వహించామని జగన్ గుర్తుచేసుకున్నారు. కుల గణన ద్వారా వెనుకబడిన, అణగారిన వర్గాలకు మరింత సంక్షేమాన్ని అందించవచ్చని, సమాజంలోని అన్ని వర్గాలకు నిజమైన సామాజిక న్యాయాన్ని, అభివృద్ధిని అందించటంలో ఇది ఇది కీలకమైన అడుగు అని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని జగన్ ప్రశంసించారు.
తన ప్రత్యర్థి పార్టీ తెలుగుదేశం భాగస్వామిగా ఉన్న ఎన్డీయే (NDA) గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి వైఎస్ జగన్ స్వాగతం పలకడం సంచలనంగా మారింది. రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వ కుల గణన నిర్ణయానికి జగన్ మద్దతు పలకడంతో వైసీపీ నేతలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. అల్టీమేట్గా జనానికి మంచి జరగడమే తమ పార్టీ అజెండా అని చెబుతున్నారు.