‘100 మందికే అనుమ‌తిస్తాం’.. జ‌గ‌న్ సత్తెనపల్లి టూర్‌పై ఆంక్ష‌లు

'100 మందికే అనుమ‌తిస్తాం'.. జ‌గ‌న్ సత్తెనపల్లి టూర్‌పై ఆంక్ష‌లు

మాజీ ముఖ్య‌మంత్రి (Former Chief Minister) వైఎస్ జ‌గ‌న్ (YS Jagan) స‌త్తెన‌ప‌ల్లి టూర్‌ (Sattenapalli Tour)కు పోలీసులు (Police) అనుమ‌తి (Permission) నిరాక‌రించారు. ఒక‌వేళ జ‌గ‌న్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు రావాల‌నుకుంటే మాత్రం తాము పెట్టిన‌ కండీష‌న్స్‌ (Conditions)ను పాటించాల‌ని సూచించారు. వైసీపీ అధినేత (YSRCP Leader) ప‌ల్నాడు జిల్లా (Palnadu District)ప‌ర్య‌ట‌న‌పై ఎస్పీ శ్రీ‌నివాస‌రావు (SP Srinivas Rao) ప్రెస్‌మీట్ (Press Meet) నిర్వ‌హించి, ప‌లు విష‌యాల‌ను వెల్ల‌డించారు.

పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి (Sattenapalli)లో ఈనెల 18న మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప‌ర్య‌ట‌న‌కు షెడ్యూల్ ఖ‌రారైంది. రెంట‌పాళ్ల గ్రామ ఉప‌స‌ర్పంచ్ (Deputy Sarpanch) కొర్ల‌కుంట నాగ‌మ‌ల్లేశ్వ‌ర‌రావు (Korlakunta Nagamalleswara Rao) కుటుంబాన్ని ప‌రామ‌ర్శించి, అక్క‌డ విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌నున్నారు. కాగా, జ‌గ‌న్ స‌త్తెన‌ప‌ల్లి ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ (In-Charge) సుధీర్ భార్గ‌వ్‌రెడ్డి (Sudheer Bhargav Reddy) అర్జీ పెట్ట‌గా, అందులో తమ‌కు కావాల్సిన స‌మాచారం లేద‌ని, అందుకే అనుమ‌తి నిరాక‌రిస్తున్న‌ట్లుగా తేల్చారు. పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందించకపోవడం, శాంతి భద్రతలకు ఆటంకం కలిగే అవకాశం ఉండడం, గతంలో జరిగిన ఘటనలు వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప‌ల్నాడు ఎస్పీ తెలిపారు.

జగన్ ప‌ర్య‌ట‌న‌కు ఎస్పీ(SP) కొన్ని కండీష‌న్స్ (Conditions) పెట్టారు. భారీ ఎత్తున ప్ర‌జ‌లు, అభిమానులు, వైసీపీ కార్య‌క‌ర్త‌లు వ‌స్తామంటే ఒప్పుకోమ‌ని, జ‌గ‌న్ వెంట కేవ‌లం 100 మంది (100 People) అయితే ప‌ర్మిష‌న్ ఇస్తామ‌న్నారు. కాన్వాయ్‌తో పాటు మూడు వాహనాలు, వంద మందికి మాత్రమే అనుమతి ఇవ్వగలమని, భారీగా జనం గుమిగూడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. లేదంటే గ్రామ శివార్లలో బహిరంగ స్థలంలో కార్యక్రమం నిర్వహించుకోవాలని స‌ల‌హా ఇచ్చారు.

జ‌గ‌న్ స‌త్తెన‌ప‌ల్లి ప‌ర్య‌ట‌న‌కు పోలీసులు అనుమ‌తి నిరాక‌రించ‌డాన్ని వైసీపీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ నిషేధం వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం జగన్ పర్యటనలను అడ్డుకోవడానికి పోలీసుల‌పై ఒత్తిళ్లు తెస్తోందని, పోలీసుల‌ను అడ్డుపెట్టుకొని శాంతిభ‌ద్ర‌త‌ల పేరుతో మాజీ సీఎం టూర్‌కు ఆటంకం క‌లిగిస్తోంద‌ని మండిప‌డుతున్నారు. జగన్ పర్యటనకు భారీగా జనం రావడం వల్ల అధికార పక్షం భయపడుతోందని, అందుకే ఈ నిషేధం విధించారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఎస్పీ ప్ర‌క‌ట‌న‌పై వైసీపీ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ప‌ల్నాడు ఎస్పీ ప‌ర్య‌ట‌న‌ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఒకవైపు జగన్ పర్యటనలు ప్రజల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయని, అందుకే అధికార పక్షం భయపడుతోందని వైసీపీ వాదిస్తుండగా, మరోవైపు శాంతి భద్రతల పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment