ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో మరోసారి ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారం సంచలనం రేపుతోంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy)పై గతంలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అధికారంలో ఉన్నప్పుడు నిఘా (Surveillance) పెట్టారని వైసీపీ (YSRCP) ఆరోపించింది.
వైసీపీ అధికారికంగా ఓ వీడియోను ట్వీట్ చేస్తూ, 2018 నుంచి 2019 మధ్య కాలంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఫోన్ (Jagan Phone) సహా, పార్టీ కీలక నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని పేర్కొంది. “చంద్రబాబు ఆధ్వర్యంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని (Modern Technology) ఉపయోగించి ఫోన్లపై నిఘా పెట్టారు. ఈ విషయాన్ని వాట్సాప్ (WhatsApp) యాజమాన్య సంస్థ మెటా (Meta) వెల్లడించింది” అంటూ ఆ వీడియోలో తెలిపింది. ఈ ఆరోపణలతో రాష్ట్ర రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు మరోసారి ఈ అంశంపై పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.
2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ (Intelligence Chief) గా ఏబీ వెంకటేశ్వరరావు (A. B. Venkateswara Rao) ఉన్న సమయంలో నిఘా పరికరాల కొనుగోలులో అవకతవకలు జరిగాయని గత ప్రభుత్వ హయాంలో జరిపిన విచారణలో తేలడంతో ఏబీవీ (ABV)పై చర్చలు తీసుకున్న విషయం తెలిసిందే. టీడీపీ (TDP) హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు ఫోన్ ట్యాపింగ్లో కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వైసీపీ హయాంలో విధులకు దూరంగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును ప్రస్తుత కూటమి ప్రభుత్వం (Coalition Government) పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ (Police Housing Corporation) చైర్మన్ (Chairman) పదవి ఆఫర్ చేసిన విషయం తెలిసిందే.
2014-19 మధ్య @ncbn అధికారంలో ఉన్నపుడు ప్రతిపక్ష నేత @ysjagan సహా ఆ పార్టీ ముఖ్య నేతల ఫోన్ల మీద నిఘా పెట్టినట్లు తేలింది. అధునాతన పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఫోన్లు ట్యాప్ చేసినట్లు వాట్సాప్ యాజమాన్య సంస్థ అయిన మెటా ప్రకటించింది. pic.twitter.com/kQAwxbxyux
— YSR Congress Party (@YSRCParty) April 16, 2025