ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ ఎవరు..?

ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ ఎవరు..?

ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన స్థానంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్టు ప్రకటించాడు. 2024 ఐపీఎల్ సీజన్‌లో హార్దిక్ కెప్టెన్‌గా ఉన్నప్పటికీ, కొత్త సీజన్‌లో సూర్యకు ఆ బాధ్యతలను అప్పగించారు.

ఈ విషయాన్ని హార్దిక్ స్వయంగా తన ఎక్స్ (ట్విట్ట‌ర్‌) అకౌంట్ ద్వారా వెల్లడించాడు. ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడనున్న నేపథ్యంలో, సూర్యకుమార్ యాదవ్ ఆ మ్యాచ్‌కు నాయకత్వం వహించనున్నాడు. ఈ నిర్ణయం జట్టు వ్యూహంలో ఏమైనా మార్పున‌కు దారి తీస్తుందా? అనేది అభిమానుల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment