ఐపీఎల్ (IPL-2025 సీజన్కు సంబంధించిన మినీ వేలాన్ని (Mini Auction) తిరిగి భారత్(India)లో నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) యోచిస్తున్నట్లు సమాచారం. గత రెండు ఐపీఎల్ సీజన్ల వేలాలు దుబాయ్ (Dubai), సౌదీ అరేబియా (Saudi Arabia)లోని జెడ్డా (Jeddah)లో జరిగిన విషయం తెలిసిందే.
క్రిక్బజ్ (Cricbuzz) నివేదిక ప్రకారం, మూడు సంవత్సరాల తర్వాత ఈ క్యాష్రిచ్ వేలాన్ని మళ్లీ భారత్కు తీసుకురావడానికి బీసీసీఐ సిద్ధమవుతోంది. ఈ అంశంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, త్వరలోనే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ (GC) సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
మినీ వేలాన్ని డిసెంబర్ 13 నుండి 15 మధ్య నిర్వహించే అవకాశం ఉందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. అయితే, గతేడాది బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy) షెడ్యూల్ (Schedule), అప్పటి బీసీసీఐ(BCCI) కార్యదర్శి జై షా (Jay Shah) విదేశీ పర్యటన కారణంగా వేలం కాస్త ముందుగా (నవంబర్ 24, 25 తేదీల్లో) జరిగింది.
ఐపీఎల్ వేలం ఇప్పటివరకు అత్యధికంగా ఏడు సార్లు బెంగళూరులోనే జరిగింది. అయితే, గత కొన్ని ఐపీఎల్ సీజన్లలో అహ్మదాబాద్ అత్యంత ప్రాధాన్యతగల వేదికగా మారింది. 2022లో గుజరాత్ టైటాన్స్ (GT) జట్టు అరంగేట్రం చేసినప్పటి నుంచి, గత నాలుగు ఐపీఎల్ ఫైనల్స్కు అహ్మదాబాద్ వేదికైంది. ఈ నేపథ్యంలో, ఈసారి మినీ వేలాన్ని మొదటిసారిగా అహ్మదాబాద్లో నిర్వహించే అవకాశం ఉందని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.
ఐపీఎల్ వేలం ఇప్పటివరకు జరిగిన వేదికలు:
2008 – ముంబై
2009 – గోవా
2010 నుండి 2012 – బెంగళూరు
2013 – చెన్నై
2014 – బెంగళూరు
2015 నుండి 2018 – బెంగళూరు
2019 – జైపూర్
2020 – కోల్కతా
2021 – చెన్నై
2022 – బెంగళూరు
2023 – దుబాయ్ (UAE)
2024 – జెడ్డా (సౌదీ అరేబియా)








