క్రికెట్ ఫ్యాన్స్‌కు ఐపీఎల్ డ‌బుల్ ట్రీట్‌

క్రికెట్ ఫ్యాన్స్‌కు ఐపీఎల్ డ‌బుల్ ట్రీట్‌

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌లో అభిమానులకు శనివారం డబుల్ ట్రీట్ (Double Treat) అందుబాటులోకి రానుంది. ఈరోజు (శనివారం) రెండు కీలక మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మరియు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య చెన్నైలోని చిదంబరం స్టేడియం (Chidambaram Stadium) లో తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఇప్పటికే ఢిల్లీ రెండు మ్యాచ్‌లు ఆడి రెండింట్లోనూ విజయాలు సాధించి మంచి ఫామ్‌లో ఉంది. మరోవైపు చెన్నై మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో విజయం సాధించింది.

రాత్రి 7:30 గంటలకు జరిగే రెండో మ్యాచ్‌లో పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ (Punjab Kings) మరియు రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) తలపడతాయి. పంజాబ్ ఇప్పటివరకు ఆడిన రెండు కీల‌క మ్యాచులు గెలిచి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించగా, రాజస్థాన్ మూడు మ్యాచుల్లో కేవలం ఒకటి మాత్రమే గెలిచింది. ఈ రెండు మ్యాచ్‌లూ పోటీగా ఉండే అవకాశముండటంతో అభిమానులు భారీగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment