అటు ప‌వ‌న్‌.. ఇటు జ‌గ‌న్ – తిరుమ‌ల‌లో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న‌

అటు ప‌వ‌న్‌.. ఇటు జ‌గ‌న్ - తిరుమ‌ల‌లో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న‌

తిరుప‌తిలో ప‌ద్మావ‌తి ఆస్ప‌త్రి వ‌ద్ద ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. తొక్కిస‌లాట‌లో గాయ‌ప‌డిన వారిని ప‌రామ‌ర్శించేందుకు నిన్న రాజ‌కీయ నేత‌లంతా ఒక‌రి త‌రువాత మ‌రొక‌రు తిరుప‌తికి చేరుకున్నారు. ఉద‌యం టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్‌, మాజీ మంత్రి రోజా తొక్కిస‌లాట జ‌రిగిన ప్ర‌దేశాన్ని, వైకుంఠ ్వార ద‌ర్శ‌న క్యూలైన్ల‌ను ప‌రిశీలించ‌గా, ఆ త‌రువాత మంత్రులు, ఆ వెంట‌నే చంద్ర‌బాబు, ప‌వ‌న్‌, వైఎస్ జ‌గ‌న్ ఇలా నేత‌లంతా తిరుప‌తికి చేరుకున్నారు.

తొక్కిస‌లాట‌లో గాయ‌ప‌డి ప‌ద్మావ‌తి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న క్ష‌త‌గాత్రుల‌ను ప‌రామ‌ర్శించిన అనంత‌రం అధికారులు, పోలీసుల‌పై తీరుపై మైక్ ప‌ట్టుకొని డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో అక్క‌డున్న క్రౌడ్ నుంచి జై అంటూ నినాదాలు, ఈలలు, కేకలతో ఆస్ప‌త్రి ప్రాంగణం మార్మోగిపోయింది. దీంతో పవన్ ప్రసంగం ఆపి పక్కనే ఉన్న జనసేన నేతను ఏంటని అడిగారు. వెంట‌నే ఆ నేత… వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి వచ్చారు అని ప‌వ‌న్‌కు చెప్పారు.

ఈ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది. వైసీపీ ఫ్యాన్స్ ఇది జ‌గ‌న్ క్రేజ్ అంటూ పోస్టులు పెడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment