పిఠాపురంలో కులోన్మాదం పేట్రేగిపోతోంది. ఇటీవల మల్లాం గ్రామంలో దళితుల సాంఘిక బహిష్కరణ జరగ్గా, తాజాగా ఐదు నెలల అమాయక పసికందు కులోన్మాదానికి బలైపోయిన విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. పిఠాపురంలోని జగ్గయ్య చెరువు కాలనీలో శైలజ అనే యువతి సతీష్ అనే వ్యక్తిని ప్రేమించింది. పెద్దలు అంగీకరించకపోయినా సతీష్ను కులాంతర వివాహం చేసుకుంది. దంపతులకు ప్రస్తుతం ఐదు నెలల పాప ఉంది.
వివాహం అయినప్పటి నుంచి భర్త తనను అత్తగారింటికి తీసుకెళ్లలేదని, పాప పుట్టిన తర్వాత కూడా భర్త తరఫున బంధువులు, కుటుంబ సభ్యులు చూడ్డానికి రాలేదని శైలజ ద్వేషం పెంచుకుంది. తన తల్లిదండ్రులు చూసిన సంబంధం కాదని, వేరే కులానికి చెందిన సతీష్ను వివాహం చేసుకోవడం శైలజ తల్లి పసుపులేటి అన్నవరానికి లేదు. తమ కులానికి చెందిన వ్యక్తితోనే కూతురి వివాహం జరగాలనిది ఆమె ఆలోచన.
సతీష్, శైలజలకు పుట్టిన యశ్వితను అడ్డు తొలగిస్తే కూతురికి రెండో పెళ్లి చేయవచ్చనే కుటిల బుద్ధిని అప్పటికే భర్తతో ఆగ్రహంతో ఉన్న కూతురికి నూరిపోసింది. తల్లి కుట్రను అమలు చేసే ప్రక్రియలో శైలజ తన ఐదు బిడ్డను అడ్డు తొలగించుకోడానికి పథకం వేసింది. అందులో భాగంగా ఈ ల 6వ తేదీ అర్ధరాత్రి ఏ పాపం తెలియని ఆ పసికందు గొంతు నులిమి హత్య చేశారు. ఎవరికీ సందేహం రాకుండా పాప మృతదేహాన్ని ఇంటి వెనక ఉన్న నూతిలో పడవేశారు. హత్యను కప్పిపుచ్చడానికి క్షుద్రపూజల జరగాయని చెప్పి నమ్మించి కేసును పక్కదారి పట్టించేందుకు ఇంటి ముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయ పెట్టి నిద్ర పోయినట్లు నటించారు.
ఈ ఘటనపై స్థానికులు తీవ్రంగా స్పందించగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని డాగ్ స్క్వాడ్తో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. పసికందు తల్లి, అమ్మమ్మ కలిసి చంపేసి నూతిలో పడేసి క్షుద్రపూజలని డ్రామాలాడినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. తన కూతురు ప్రేమించి పెళ్లిచేసుకోవడం ఇష్టంలేని తల్లి.. తన కులానికి చెందిన వ్యక్తితోనే పెళ్లి చేయాలనే కుట్రలో భాగంగానే ఆమెను ఒప్పించి, ఇంత దారుణానికి ఒడిగట్టినట్లుగా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.