ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాల సందర్భంగా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ అసెంబ్లీకి హాజరయ్యారు. గవర్నర్కు స్పీకర్, మండలి చైర్మన్, సీఎం స్వాగతం పలికారు.
ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తన ప్రసంగంలో సీఎం చంద్రబాబు నాయుడు పేరును మర్చిపోయి తప్పుగా పలికారు. నరేంద్ర చంద్రబాబు నాయుడు
అని గవర్నర్ తప్పుగా పలకిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నారాకు బదులు నరేంద్ర అని పలికి ఉంటారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం ఉభయ సభలు వాయిదా పడనున్నాయి.