న్యాయవాదుల ఆందోళన.. అసెంబ్లీ ముట్టడికి యత్నం

న్యాయవాదుల ఆందోళన.. అసెంబ్లీ ముట్టడికి యత్నం

హైదరాబాద్‌లో న్యాయవాదులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. తమ భద్రత కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, “అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్”ను రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిన్న జరిగిన ఓ న్యాయవాది హత్య ఘటన ఈ నిరసనలకు కారణమైంది.

అసెంబ్లీ ముట్టడికి యత్నం.. లాయర్ల అరెస్టు
న్యాయవాదులు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించారు. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన న్యాయవాదులను పోలీసులు అడ్డుకుని గన్ పార్క్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిరసన కారులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఏం జరిగింది?
హైదరాబాద్‌లోని చంపాపేట్ పరిధిలో న్యాయవాది ఇజ్రాయెల్‌పై ద‌స్త‌గిరి అనే వ్య‌క్తి దాడి చేయ‌డంతో తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మహిళను వేధిస్తున్న ఎలక్ట్రిషియన్ దస్తగిరిపై ఇజ్రాయెల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుకు ప్రతీకారంగా దస్తగిరి కత్తితో దాడి చేసి హత్య చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment