హైదరాబాద్‌లో అల్ప్రాజోలం టాబ్లెట్లు స్వాధీనం

హైదరాబాద్‌లో అల్ప్రాజోలం టాబ్లెట్లు స్వాధీనం

హైదరాబాద్‌ (Hyderabad)లో ఎక్సైజ్ శాఖ (Excise Department) భారీ ఎత్తున అల్ప్రాజోలం టాబ్లెట్ల (Alprazolam Tablets)ను స్వాధీనం (Seized) చేసుకుంది. మొత్తం 1.8 లక్షల టాబ్లెట్లను జప్తు చేసిన ఎక్సైజ్ అధికారులు, ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ (Accused Arrest) చేశారు. మరొక నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ముగ్గురిపై ఎక్సైజ్ పోలీసులు ఎన్‌డీపీఎస్ చట్టం (NDPS ACT) కింద కేసు నమోదు చేశారు.

ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ (Excise Joint Commissioner) ఖురేషి (Khureshi) మాట్లాడుతూ, “నిబంధనలకు విరుద్ధంగా అల్ప్రాజోలం టాబ్లెట్లను సప్లై చేస్తున్న ముఠాను పట్టుకున్నాం. మొత్తం 1.8 లక్షల టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నాం, వీటి విలువ సుమారు రూ.9 లక్షలు. హైదరాబాద్‌లోని ఆటోనగర్‌లో ఒక కొరియర్ ఆఫీస్ నుంచి ఈ టాబ్లెట్లను తరలిస్తుండగా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశాం. ఈ టాబ్లెట్లు గుజరాత్‌లో తయారైనట్లు గుర్తించాం,” అని తెలిపారు.

అల్ప్రాజోలం టాబ్లెట్లు మానసిక రుగ్మతల చికిత్సకు వినియోగించే మందులు అయినప్పటికీ, వీటిని డాక్టర్ సూచన లేకుండా ఉపయోగించడం ప్రాణాంతకం కావొచ్చని అధికారులు హెచ్చరించారు. “ఈ ముఠా అనుమతి లేకుండా మెడికల్ షాపులకు, సాధారణ ప్రజలకు ఈ టాబ్లెట్లను అక్రమంగా సరఫరా చేస్తోంది,” అని ఖురేషి వెల్లడించారు. అరెస్టయిన నిందితులు లక్ష్మణ్ మరియు మునిశేఖర్‌ను రిమాండ్‌కు తరలించగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన అజయ్ త్రిపాఠి పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Join WhatsApp

Join Now

Leave a Comment