హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ మరోసారి సెయిలింగ్ క్రీడలకు ఆతిథ్యమిచ్చింది. గురువారం ఘనంగా ప్రారంభమైన తెలంగాణ స్టేట్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ ఎనిమిదో ఎడిషన్లో ఆరు విభాగాల్లో 15 జిల్లాల నుంచి 131 మంది క్రీడాకారులు తమ ప్రతిభను కనబర్చనున్నారు.
మొదటి రోజు ప్రతికూల వాతావరణం మధ్య సెయిలర్లు రంగు రంగుల బోట్లలో ప్రాక్టీస్ చేస్తూ తమ ప్రతిభతో చూపరులను అలరించారు. తెలంగాణ సెయిలింగ్ సంఘం మరియు యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఛాంపియన్షిప్ దేశంలోనే అతిపెద్ద టోర్నమెంట్లలో ఒకటిగా నిలుస్తోంది.
2026 ఆసియా క్రీడలు, ఒలింపిక్స్ లక్ష్యంగా..
యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ సుహేమ్ షేక్ మాట్లాడుతూ, ఈసారి కొత్త విభాగాలైన 29 ఈఆర్ స్కిఫ్ మరియు 420 డబుల్ హ్యాండర్స్ జోడించడం ద్వారా టోర్నీలో రికార్డు స్థాయి ఎంట్రీలు నమోదయ్యాయని తెలిపారు. అలాగే, తెలంగాణలో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, తీర్చిదిద్దడానికి తమ సంఘం నిరంతరం కృషి చేస్తుందని, ముఖ్యంగా 2026 చైనా ఆసియా క్రీడలు, లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ కోసం క్రీడాకారులను సిద్ధం చేస్తామని పేర్కొన్నారు.