కేంద్ర ప్రభుత్వ బడ్జెట్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్రావు స్పందించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని విమర్శించారు. 2024లో ఆంధ్రప్రదేశ్ కోసం, 2025 ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల కోసం బడ్జెట్ పెట్టారని ఆరోపించారు. 2026లో యూపీ కోసం, 2027లో గుజరాత్ కోసం బడ్జెట్ పెడతారా? యావత్ దేశానికి సరిపోయే బడ్జెట్ ఎప్పుడు పెడతారు? అని కేంద్రాన్ని హరీశ్రావు నిలదీశారు. బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి చోటు లేదా? మా ప్రాంత ప్రయోజనాలకు విలువ లేదా? అని కేంద్రంపై సెటైర్లు వేశారు.
హరీష్రావు మాట్లాడుతూ.. మొత్తం దేశాన్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ను ప్రవేశపెట్టాలని సూచించారు. బడ్జెట్లో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎటువంటి కేటాయింపులు చేయలేదని దుయ్యబట్టారు. ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎనిమిది ఎంపీలున్నా బీజేపీ రాష్ట్రానికి ఏం సాధించారో చెప్పాలని హరీష్రావు డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని కేంద్రం ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. విభజన చట్టం ప్రకారం హామీలు ఇచ్చినా వాటిని అమలు చేయడం లేదని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో కాంగ్రెస్, బీజేపీ విఫలమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేయడం లేదని హరీష్రావు వ్యాఖ్యానించారు. “రాష్ట్ర ప్రయోజనాలను నిలబెట్టుకోవడానికి భవిష్యత్తులో బీఆర్ఎస్ పోరాడుతుందని” అని ఆయన స్పష్టం చేశారు.