చంద్రబాబుతో రేవంత్ మ్యాచ్ ఫిక్సింగ్‌? – హరీశ్ సంచలన ఆరోపణలు

చంద్రబాబుతో రేవంత్ మ్యాచ్ ఫిక్సింగ్‌? – హరీశ్ సంచలన ఆరోపణలు

తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) మరోసారి రగడ రాజుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి (Nara Chandrababu Naidu)తో రహస్య ఒప్పందం (Secret Agreement) కుదుర్చుకున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) సంచలన ఆరోపణలు చేశారు. గోదావరి-బనకచర్ల (Godavari-Banakacharla) ప్రాజెక్టు విషయంలో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు తెలంగాణ జల హక్కులకు భంగం కలిగిస్తోందని, ఈ విషయంలో చంద్రబాబుతో మ్యాచ్‌ ఫిక్సింగ్(Match Fixing) జరిగిందని హరీశ్ రావు ఆరోపించారు. ఈ ఆరోపణలు రాష్ట్రాల మధ్య జల వివాదాన్ని మరింత ఉద్ధృతం చేసే అవకాశం ఉంది.

హరీశ్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “చర్చల ప్రతిపాదన అనే పేరుతో రేవంత్ రెడ్డి, చంద్రబాబు మధ్య ఫిక్సింగ్ జరిగింది. ఢిల్లీలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఈ రహస్య ఒప్పందాన్ని బహిర్గతం చేశాయి” అని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న‌ కేసీఆర్‌(KCR) గోదావరి నదిలో 2,918 టీఎంసీ నీటిని కోరగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం 1,000 టీఎంసీకి పరిమితమవుతోందని ఆయన ఆరోపించారు. “అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగేలా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు, రేవంత్ ఎందుకు నేరుగా చంద్రబాబుతో చర్చలు జరుపుతున్నారు? ఇది చంద్రబాబుకు గురుదక్షిణ ఇచ్చే ప్రయత్నమా?” అని హరీశ్ రావు ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో గోదావరి నీటి వినియోగంపై చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి కారణమయ్యాయి. ఆయన 1,000 టీఎంసీ గోదావరి నీటిని, 500 టీఎంసీ కృష్ణా నీటిని తెలంగాణకు అనుమతిస్తే, ఆంధ్రప్రదేశ్ బనకచర్ల ప్రాజెక్టును తాము వ్యతిరేకించబోమన్నారు. ఈ వ్యాఖ్యలను హరీశ్ రావు తీవ్రంగా ఖండిస్తూ, “తెలంగాణ జల హక్కులను రాసిచ్చే అధికారం రేవంత్‌కు ఎవరిచ్చారు? ఇది రాష్ట్ర ప్రజల జీవనాడి అయిన నీటి హక్కుల విషయం, రేవంత్ జాగీరు కాదు,” అని ధ్వజమెత్తారు. ఈ ఆరోపణలు రాజకీయ వేడిని పెంచడంతో పాటు, రాష్ట్రాల మధ్య జల విభజనపై సుప్రీంకోర్టు జోక్యం అవసరమనే చర్చకు దారితీశాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment