తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాల బ్రాండ్ అంబాసిడర్గా మారారని BRS ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ పదేళ్లు తెలంగాణను నంబర్ వన్గా తీర్చిదిద్దారని, అలాంటి నేతపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు.
శనివారం శాసనసభలో కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపించారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. దీనికి ఆయన క్షమాపణలు చెప్పాలి. అంతేకాదు, BRS ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని ఏకపక్షంగా సస్పెండ్ చేశారు’’ అని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే, గతంలో ఎల్ఆర్ఎస్ ఉచితమని కాంగ్రెస్ నేతలు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు.