ఇంగ్లాండ్(England) తో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భారత్ (India) ఓటమిని మూటగట్టుకుంది. టాప్ ఆర్డర్లు, మిడిలార్డర్లు ఇంగ్లాండ్ బౌలింగ్ దాటికి కుప్పకూలిపోయారు. హార్దిక్ పాండ్యా (Hardik Pandya) 35 బంతుల్లో 40 పరుగులు చేసి భారత్ తరఫున అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్గా నిలిచినా, అతని బ్యాటింగ్ నెమ్మదిగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మాజీ క్రికెటర్లు పార్థివ్ పటేల్ (Parthiv Patel) మరియు కెవిన్ పీటర్సన్ (Kevin Pietersen) హార్దిక్ బ్యాటింగ్ను తీవ్రంగా విమర్శించారు. “టీ20 ఫార్మాట్లో బ్యాటర్ క్రీజ్లో సెట్ కావడానికి 20-25 బంతులు తీసుకోవడం అనవసరం” అని పేర్కొన్నారు. మిడిల్ ఓవర్లలో హార్దిక్ అనవసరంగా ఎక్కువ బంతులు వృథా చేయడం వల్లే టీమిండియా పరాజయం పాలైందని వారు అభిప్రాయపడ్డారు.