హనుమకొండలో నడిరోడ్డుపై దారుణమైన హత్య చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని అతి కిరాతకంగా కత్తులతో పొడిచి చంపేశారు. సుబేదారి పీఎస్ పరిధిలోని డీమార్ట్ వద్ద ఈ హత్య జరిగి సంచలనం రేపింది. ఇద్దరు ఆటో డ్రైవర్లు మధ్య జరిగిన కత్తులతో దాడి చివరకు ప్రాణాలు తీసింది. ఈ కత్తుల దాడి ఘటనలో మడికొండకు చెందిన రాజ్కుమార్ అనే ఆటోడ్రైవర్ మృతిచెందాడు. సుబేదారి పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. హత్యపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బొల్లికొండ లావణ్య అనే మహిళతో రాజ్ కుమార్,వెంకటేశ్వర్లు వివాహేతర సంబంధం పెట్టుకున్నారు.
ఇదే క్రమంలో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి రాజ్ కుమార్ను వెంకటేశ్వర్లు హత్య చేశాడు. మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పోలీసులు ఎంజీఎంకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు, మృతుడు ఇద్దరూ ఆటో డ్రైవర్లు కావడం గమనార్హం.